ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరపెడుతుంటే.మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
యువతులను, మహిళలను మాయమాటలతో ముగ్గులోకి దించి అనంతరం బ్లాక్ మెయిలింగ్కు దిగుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది.తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ ఎన్ఆర్ఐ బాలికను ట్రాప్ చేసి వేధించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని పాల్డా గ్రామానికి చెందిన దేవనపల్లి సందీప్ అనే యువకుడు అమెరికాలో ఉంటున్న 12 ఏళ్ల భారత సంతతి బాలికతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు.సదరు బాలిక తల్లిదండ్రులు కూడా తెలుగువారే.
వారు హైదరాబాద్ నుంచి వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.
సందీప్ తెలుగు వ్యక్తి కావడంతో ఆమె కూడా అతడితో మాట కలిపింది.
తన మాయమాటలతో ఆ బాలికకు బాగా దగ్గరైన సందీప్.ఆమె నగ్నచిత్రాలను సేకరించాడు.
అక్కడితో ఆగకుండా మరిన్ని నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలంటూ వేధించాడు.తాను చెప్పిన పని చేయకుంటే తన వద్ద వున్న నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో భయపడిన బాలిక.సందీప్ను బ్లాక్ చేసి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు హైదరాబాద్లో ఉన్న సన్నిహితుల ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సందీప్ను అదుపులోకి తీసుకున్నారు.
ఎంతోమంది మహిళలు ఇలాంటి కేటుగాళ్ల బారినపడి వేధింపులను ఎదుర్కొంటున్నారు.వీటిలో వెలుగులోకి వచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.కుటుంబం పరువు గురించి భయపడి పోలీసులను ఆశ్రయించడానికి ఎంతో మంది జంకుతున్నారు.అయితే అలాంటి భయాలను పక్కనబెట్టి కేటుగాళ్ల ఆటకట్టించడంలో తమకు సహాయం చేయాలని కోరుతున్నారు పోలీసులు.