టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జోడీ కట్టిన భామ నివేతా థామస్.మొదటి సినిమాతోనే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న నివేతా జై లవకుశ తర్వాత ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా ప్రేక్షకులకి కనిపించలేదు.
డాన్స్, నటనలో అదిరిపోయే రేంజ్ లో తన టాలెంట్ చూపిస్తున్న ఈ అమ్మడు వైపు టాలీవుడ్ లో పెద్ద దర్శకుల చూపు వెళ్లకపోవడం గమనార్హం.అయితే తన సత్తా ఏంటో తెలిసిన ఈ భామ సరైన చిత్రాలని ఎంపిక చేసుకుంటూ మళ్ళీ గట్టిగా కొట్టాలనే కసితో ఉంది.
ఆమె తెలుగులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, బ్రోచెవారెవరురా అనే చిన్న సినిమాలో కుర్ర హీరో శ్రీ విష్ణుకి జోడీగా నటిస్తుంది.మెంటల్ మదిలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ నుంచి వస్తున్నా రెండో సినిమా ఇదే కావడం విశేషం.
అయితే లవకుశ లాంటి పెద్ద సినిమాలో నటించి మళ్ళీ ఈ సినిమాకి పడిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.అయితే గ్లామర్ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా అభ్యంతరం చెప్పే ఈ భామ రొటీన్ తరహా పాత్రలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవాడంతోనే కమర్షియల్ హీరోయిన్ గా అవకాశం రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.
మరి ఇలాంటి టైంలో చిన్న సినిమాతో మెరుపులు మేరిపించడానికి రెడీ అయిన నివేతాని తెలుగు ప్రేక్షకు ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలి.