లాక్ డౌన్ తర్వాత మరల టాలీవుడ్ వరుసగా సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్లిపోయారు.
పదుల సంఖ్యలో సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి.వచ్చే ఏడాది మొత్తం సినిమాల పండగ స్టార్ట్ అవుతుంది.
చిన్న సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటుంది.ఇదిలా ఉంటే దగ్గుబాటి రానా అరణ్య సినిమా తర్వాత ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ఇందులో సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ లాంటి టాలెంటెడ్ యాక్టర్లు నటిస్తున్నారు.
ఇక రానా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక సాయి పల్లవి గిరిజన యువతిగా, ప్రియమణి నక్షలైట్ దళ కమాండర్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరోయిన్ కూడా భాగం అయ్యిందని టాక్ వినిపిస్తుంది.నివేదా థామస్ ఇప్పుడు విరాటపర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువగానే ఉన్న కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలుస్తుంది.
ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.అయితే ఆమె చేయబోయే పాత్ర ఎంటనేదానిపై మాత్రం చిత్రం యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ తెలిపే వరకు వేచి చూడాల్సిందే.