నటిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మల్లు భామ నివేతా థామస్.ఈ అందాల భామ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ప్రతి సినిమాలో కూడా తన మార్క్ కచ్చితంగా ఉండే విధంగా సినిమాలు చేస్తూ వస్తుంది.
ఎన్ఠీఆర్ తో సినిమా చేసిన తర్వాత శ్రీవిష్ణుతో సినిమా లో బడ్జెట్ సినిమా చేయడం ఈ అమ్మడుకి మాత్రమే టాలీవుడ్ లో సాధ్యం అని చెప్పాలి.ఒక స్టార్ హీరోతో సినిమా చేసిన ఇక చిన్న సినిమాలు పక్కన పెట్టె అందాల భామలు చాలా మంది ఉన్నారు.
కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేసి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఈ ప్రయత్నంలో కొంతమంది భామలు సక్సెస్ అవుతారు.
అయితే స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని కోరిక తనకి లేదని అంటుంది నివేతా థామస్.కేవలం తన దగ్గరకి వచ్చిన కథలలో మంచివి ఎంచుకొని అందులో నా పాత్ర అందరికి గుర్తుండిపోయే విధంగా చేయడమే నా ముందున్న లక్ష్యం అని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం నివేతా థామస్ నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సందర్భంగా మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయలేమని, ఒక వేళ చేసిన ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు కాబట్టి ఓటీటీ బెస్ట్ అని అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పింది.అలాగే తనకి పాత్ర నచ్చితే చేస్తానని, నెంబర్ వన్ గేమ్ లో ఎప్పుడు భాగం కానని, సినిమా రేంజ్ తో తనకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఏది ఏమైనా అలాగే వెబ్ సిరీస్ లలో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఏదైనా మంచి కథ వస్తే అప్పుడు ఆలోచిస్తానని నివేతా చెప్పుకొచ్చింది.అలాగే భవిష్యత్తులో దర్శకురాలిగా కూడా నిరూపించుకుంటా అని ఈ అమ్మడు తన కోరికని బయట పెట్టింది.
.