మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల చేస్తున్న సినిమా వకీల్ సాబ్.హిందీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు తెలుగులో తెరకెక్కిస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కాని చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయి.పవన్ కళ్యాణ్ కంటిన్యూ షెడ్యూల్ తో సినిమాని లాస్ట్ వరకు తీసుకొచ్చారు.
అయితే కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిపోయింది.దీంతో ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడిపోయింది.
ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని దిల్ రాజు భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో తాజాగా లాక్ డౌన్ సడలింపు కారణంగా షూటింగ్ స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.నెల రోజుల షెడ్యూల్ పెండింగ్ లో ఉంది.
పవన్ కళ్యాణ్ ఈ నెల 25 తర్వాత షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.అంతకంటే ముందుగా మిగిలిన నటీనటులకి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేయనున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేద థామస్ కూడా షూటింగులో జాయిన్ అయింది.ఈ విషయాన్ని నివేద సోషల్ మీడియాలో వెల్లడించింది.
తిరిగి షూటింగుకి రావడం బాగుంది అంటూ నివేద పోస్ట్ పెట్టింది.అంజలి, శృతి హాసన్ ఈ వారంలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారు.
వి సినిమా ఫ్లాప్ తర్వాత నివేదా థామస్ నుంచి వకీల్ సాబ్ సినిమాకి సంబందించిన అప్డేట్ మళ్ళీ రావడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.వీలైనంత వేగంగా వకీల్ సాబ్ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని దిల్ రాజు భావిస్తున్నారు.