కోలీవుడ్ లో హీరోయిన్ గా సక్సెస్ అయ్యి ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టిపెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ తెలుగులో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అవుతుంది.
మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ రెడ్ మూవీలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది.రామ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే అధికారినిగా ఆమె అలరించబోతుంది.
దీంతో పాటు మరో రెండు సినిమాలు నివేదా లైన్ లో ఉన్నాయి.అవి కూడా యంగ్ హీరోల సరసన కావడం విశేషం.
ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా, స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని ఈ అమ్మడు కలలు కంటుంది.విరాటపర్వంలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడంతో పాటు విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటిస్తుంది.
దీంతో పాటు మరోకొత్త సినిమాకి కూడా సైన్ చేసింది.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన రెడ్ సినిమా విశేషాలని, అలాగే తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.రెడ్ సినిమాలో మొదటి సారి విభిన్నమైన పాత్ర చేసే అవకాశం వచ్చిందని, ఇందులో తన పాత్ర రెండు షెద్స్ లో ఉంటుందని తెలిపింది.చిత్రలహరి సినిమా చేస్తున్న సమయంలో నిర్మాత స్రవంతి రవి కిషోర్ రెడ్ సినిమా గురించి చెప్పడం జరిగిందని చెప్పుకొచ్చింది.
ఇక తనకి కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేయడం అంటే ఇష్టం అని, అలాగే విజయ్ సేతుపతి తరహాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.టాలీవుడ్ పై ఇప్పుడు తన ఫోకస్ ఉందని, ఇక్కడ సక్సెస్ అయ్యాక బాలీవుడ్ మీద దృష్టిపెడతానని చెప్పింది.