సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్స్ అందరూ తన వ్యక్తిగత విషయాలని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు కూడా లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.వాడి అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నారు.
ఇప్పుడు ఈ దారిలోకి అందాల భామ నివేతా పేతురాజ్ కూడా వచ్చి చేరింది.ఈ అమ్మడు తాజాగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది.
బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో కూడా ఓ కీలక పాత్రలో నటించింది.ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ రెడ్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా తనగురించిన విషయాలు చెప్పుకొచ్చింది.
నాది పూర్తిగా చిన్న పిల్లల మనస్తత్వం.
పిల్లలు కొత్తగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా, కొత్త వ్యక్తులను కలిసినా కొద్దిసేపటిపాటు సైలెంట్ గా ఉంటూ చుట్టూ ఉన్నవారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.అలవాటైతే మాత్రం ఇక వారి అల్లరిని ఎవరూ ఆపలేరు.
అలాగే నేను కూడా అంతే కొత్త ప్రదేశంలోకి వచ్చినపుడు, కొత్త వ్యక్తులతో పరిచయంఅ యినపుడు ముందు కాస్త బిడియంగా ఉంటాను.కొంచెం అలవాటైతే మాత్రం నన్ను ఎవరూ ఆపలేరు.
సినిమా సెట్ లోనూ కూడా నా పద్ధతి అలాగే ఉంటుంది.కొంచెం సేపు సైలెంట్ గా ఉంటా ఇక ఆ తర్వాత అస్సలు ఆగను.
సినిమా సెట్ లో అందరితో బాగా కలిసి పోయినప్పుడే సన్నివేశాలు బాగా వస్తాయి.ఆ ప్రభావం నటనలో కచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది, మొత్తానికి తనది ఈ ఒక్క విషయంలో పూర్తిగా చిన్న పిల్లల మనస్తత్వం అని నివేదా సోషల్ మీడియాలో అభిమానులతో చెప్పుకుంది.
.