టాలీవుడ్ లోకి మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురంలో సినిమాలలో హీరోయిన్ గా నటించిన తమిళ్ పొన్ను నివేదా పేతురాజ్.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
గ్లామర్ పాత్రలు కాకుండా తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే పాత్రలని మాత్రమే ఈ అమ్మడు చేసుకుంటూ వస్తుంది.ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ కి జోడీగా పాగల్ అనే సినిమాలో నటిస్తుంది.
అలాగే సాయి పల్లవి, రానా విరాటపర్వంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.చందూ మొండేటి దర్శకత్వంలో ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కూడా నివేతా నటించింది.
ఈ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.ఇదిలా ఉంటే తమిళ్, తెలుగు బాషలలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
అయితే సినిమాలలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడే కొన్ని విషయాలపై ఈ అమ్మడు కండిషన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికి వాటికి తూచా తప్పకుండా ఫాలో అవుతుందని బోగట్టా.
ఆన్స్క్రీన్పై బోల్డ్ సీన్లలో నటించేందుకు, హీరోతో రొమాన్స్ చేయడానికే ఒకే చెప్పిన కూడా నో కిస్ పాలసీని మాత్రం కచ్చితంగా ఫాలో అవ్వాలని నివేతా డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.హీరో విశ్వక్ సేన్తో పాగల్ సినిమాలో ఆమె ఈ రూల్ ని ఫాలో అయ్యిందని తెలుస్తుంది.
నిజానికి హీరో గత సినిమాలలో హీరోయిన్స్ తో ముద్దు సన్నివేశాలు చేశాడు.ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఉండాలని అనుకున్న నివేతా కండిషన్ పెట్టడంతో కుదరలేదని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే పాగల్ సినిమా మే1న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.