కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.టాలీవుడ్ లో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించిన అమ్మడు అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించి మెప్పిచంది.
చిత్రలహరి సినిమాలో కూడ అమ్మడు నటించింది.తెలుగులో హీరోయిన్ గా కొనసాగుతున్న అమ్మడు సోలో హీరోయిన్ గా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంది.
ఇక లేటెస్ట్ గా అమ్మడు తన ఆలోచనలను ఆడియెన్స్ లో పంచుకుంది.
హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఎప్పటికైనా డైరక్షన్ చేయాలని ఉందని అంటుంది నివేదా పేతురాజ్.
సొంతంగా కథ రాసుకుని డైరక్షన్ చేయాలనే ఆలోచన ఉందని అది ఎప్పటికైనా చేస్తానని అంటుంది నివేదా పేతురాజ్.అమ్మడి స్పెషల్ ఇంట్రెస్ట్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు.
మెగా ఫోన్ పట్టాలంటే చాలా గట్స్ ఉండాలి అయినా సరే తాను ఎప్పటికైనా డైరక్షన్ చేసి తీరుతా అంటుంది నివేదా పేతురాజ్.ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ ఒక విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటించింది.
తెలుగులో ఓ మంచి హిట్ పడితే నివేదాకు ఇక్కడ వరుస ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు.