పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాకు యంగ్ డైరెక్టర్లలో ఒకరైన సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కు జోడీగా హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం నిత్యామీనన్ 85 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.నిత్యామీనన్ రేంజ్ కు ఈ పారితోషికం తక్కువనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కొరకు పవన్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా రానాకు 5 కోట్ల రూపాయలు పారితోషికంగా లభిస్తుంది.ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కు మూడు కోట్ల రూపాయలు, సినిమాటోగ్రాఫర్ కు రెండు కోట్ల రూపాయలు పారితోషికంగా లభించనుంది.
నిత్యామీనన్ పోషిస్తున్న పాత్రకు మరో స్టార్ హీరోయిన్ అయితే రెండు కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.
పిల్ల తల్లి పాత్ర కావడం, డీ గ్లామర్ రోల్ కావడంతో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఈ పాత్రకు అస్సలు సెట్ కారు.మేకర్స్ చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరకు నిత్యామీనన్ ను ఫైనల్ చేశారు.మరోవైపు భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
మంచి నటిగా పేరు సంపాదించుకున్న నిత్యామీనన్ ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.
పాత్ర నచ్చడంతో నిత్యామీనన్ ఈ సినిమాలో తక్కువ రెమ్యునరేషన్ కు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.వకీల్ సాబ్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.త్రివిక్రమ్ ఈ సినిమా కథలో కీలక మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాకు మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.