నితిన్ హీరోగా గౌతమ్ మీనన్ నిర్మాణంలో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.ఈ సినిమా షూటింగ్ చివరి దశలో నిలిచి పోయింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా నిలిచి పోయిందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.అయితే తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన అజిత్ తమిళ చిత్రం ‘ఎన్నై ఎరిందాల’ చిత్రం మంచి విజయం సాధించింది.
దాంతో వరుస పరాజయాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గౌతమ్ మీనన్కు ఈ సక్సెస్ ఇబ్బందులను తొలగించే అవకాశాలున్నాయి.
‘ఎన్నై ఎరిందాల’ సినిమా సక్సెస్తో నితిన్తో గౌతమ్ మీనన్ నిర్మించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలకు మోక్షం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడంతో గౌతమ్ మీనన్ ఈ సినిమా వ్యవహారాలను త్వరలోనే చక్చబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
గత సంవత్సరం ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయని అనుకున్నారు.నితిన్తో ఈ సినిమాలో యామీ గౌతమి హీరోయిన్గా నటించింది.
తెలుగు మరియు తమిళంలో ఈ సినిమా ఒకే సారి తెరకెక్కింది.ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెళ్లడైయ్యే అవకాశాలున్నాయి.