సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేస్తాడనుకున్న సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఏజెంట్ గా అఖిల్ ను మాస్ హీరోగా మార్చే బాధ్యత మీద వేసుకున్నాడు డైరక్టర్ సురేందర్ రెడ్డి.
ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ఎనౌన్స్ చేశారు.ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.అయితే ఈ సినిమాకు ముందే మరో హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు సురేందర్ రెడ్డి.
అఖిల్ తో ఏజెంట్ పూర్తైన తర్వాత సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా చేస్తాడని అంటున్నారు.
యువ హీరో నితిన్ సురేందర్ రెడ్డి కాంబో సినిమా క్రేజీగా మారనుంది.ఈ మూవీ తర్వాతనే పవన్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.మొత్తానికి సురేందర్ రెడ్డి కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి, నితిన్ కాంబో సినిమాను నితిన్ సొంత బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది.
నితిన్ తో సురేందర్ రెడ్డి మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమాపై నితిన్ ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అంతకుముందే ఈ కాంబినేషన్ లో సినిమా డిస్కస్ జరిగినా ఇన్నాళ్లకు అది వర్క్ అవుట్ అవుతుంది.