యువ హీరో నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.
కాని పూజా హెగ్దే కాదు ఆ ఛాన్స్ ఉప్పెన భామ కృతి శెట్టికి వరించిందని టాక్.ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు ఇప్పటికే మూడు సినిమాలు చేస్తుంది.
అందులో రాం, లింగుసామి మూవీ ఒకటి కాగా.నాని శ్యాం సింగ్ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తుంది.
లేటెస్ట్ గా నితిన్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది అమ్మడు.నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.వక్కంతం వంశీ నితిన్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశాడట.
ఈ సినిమాలో ముందు పూజా హెగ్దే నటిస్తుందని అనుకోగా ఇప్పుడు ఆ అవకాశం కృతి శెట్టికి వచ్చిందని చెబుతున్నారు.తెలుగులో కృతి శెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతుంది.
అమ్మడు ఫాం చూస్తుంటే తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు.