మాస్ట్రో సినిమా తర్వాత లవర్ బోయ్ నితిన్ చేస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.నితిన్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.2022 ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ లో వరుస క్రేజీ సినిమాలన్ని సమ్మర్ టార్గెట్ తో వస్తున్నాయి.
ఇప్పటికే మహేష్ సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.
కె.
జి.ఎఫ్ సినిమా కూడా ఏప్రిల్ థర్డ్ వీక్ ప్లాన్ చేశారు.ఎన్.టి.ఆర్ కొరటాల శివ సినిమా కూడా ఏప్రిల్ రిలీజ్ అంటూ ప్రకటించారు.ఈ సినిమాల మధ్య నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా రిలీజ్ ప్లాన్ చేశారు.
గత కొన్నాళ్లుగా మాస్ సినిమాలకు దూరంగా ఉన్న నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో మరోసారి యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు.సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు.మరి నితిన్ ప్లాన్ ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.