యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్ మరియు రంగ్ దే సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.చెక్ సినిమా నిరాశ పర్చగా రంగ్ దే ఒక మోస్తరు అన్నట్లుగా టాక్ దక్కించుకుంది.
నితిన్ ఈ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడని భావించినా కూడా రంగ్ దే నిరాశ పర్చడంకు కరోనా పరిస్థితులు కూడా ఒక కారణం అయ్యి ఉంటుందని విశ్లేషకుల వాదన.ఇక ఈ సినిమా ఇటీవలే ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యింది.ఆ సమయంలో 7.5 రేటింగ్ తో పర్వాలేదు అన్నట్లుగా అన్నట్లుగా అనిపించుకుంది.ఇక కాస్త ఆలస్యంగా చెక్ సినిమాను కూడా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ సిద్దం చేస్తున్నారు.ఇటీవలే జెమిని టీవీ వారికి ఈ శాటిలైట్ రైట్స్ ను అమ్మేయడం జరిగింది.
నితిన్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించాడు.ఇలాంటి సినిమా ఏంట్రా బాబు అంటూ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
కాని గతంలో థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాలు బుల్లి తెర మీద సక్సెస్ అయ్యాయి.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
పెద్ద మొత్తంలో రేటింగ్ దక్కించుకోకున్నా మినిమంగా రంగ్ దే కు వచ్చిన రేటింగ్ అయినా ఈ సినిమా కు వస్తుందేమో అనే చర్చ మొదలు అయ్యింది.
ప్రముఖంగా ఈ సినిమా షూటింగ్ జరిపే సమయంలో అంచనాలు భారీగా పెరిగాయి.అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.మరి బుల్లి తెరపై ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను దక్కించుకుంటుంది అనేది చూడాలి.
జెమిని టీవీ వారు ఈ సినిమాను కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది.