తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ బాలీవుడ్ లో మంచి విజయం సాధించినటువంటి అంధాదున్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై తన తండ్రి ఎన్.
సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు సినీ పెద్దల సమక్షంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా ముఖ్యంగా బాలీవుడ్లోని అంధాదున్ చిత్రంలో కొంతమేర శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే మరి ఆ సన్నివేశాల్లో నితిన్ నటిస్తాడో లేక ఆ సీన్లను తొలగిస్తారు చూడాలి.
అయితే ఏదేమైనప్పటికీ తన స్టార్ హీరో ఫెమ్ ని పక్కనపెట్టి మొదటిసారి నితిన్ అంధుడి పాత్రలో నటిస్తూ కొత్త ప్రయోగం చేయబోతున్నాడు.
మరి ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి.అయితే అందదు చిత్రంలో విలన్ పాత్ర పోషించిన టువంటి టబు తెలుగులో కూడా నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఇందుకు గాను ఆమె దాదాపుగా కోటి రూపాయలకు పైగా పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్ర షూటింగ్ జూన్ నెల నుంచి బిజీ షెడ్యూల్ తో జరగనుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత వారంలో నితిన్ నటించిన టువంటి భీష్మ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.
అంతేగాక ఇప్పటికే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.