తెలుగు వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన నిత్యా మీనన్

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత సౌత్ ఇండియా అందాల భామలు అందరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.ఇందులో అయితే కంటెంట్ బేస్ కథలు చేయడానికి కావాల్సినంత స్కోప్ దొరుకుతుంది కాబట్టి సినిమా అవకాశాలు తగ్గిన భామలు అటువైపుగా ఇప్పటికే దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు.

 Nithya Menon Straight Telugu Web Series, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

ఈ వరుసలో ముందుగా ప్రియమణి, నిత్యా మీనన్ పేర్లు వినిపిస్తాయి.వీళ్ళ దారిలో తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు కూడా వచ్చి చేరుతున్నారు.

వీరు కూడా ఓటీటీ వరల్డ్ లో తమ టాలెంట్ ని పరిచయం చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే వీరిలో ఎవరూ కూడా స్ట్రైట్ తెలుగు వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు నటించలేదు.

తెలుగు వెబ్ సిరీస్ లు వస్తున్నా పెద్ద ప్రొడక్షన్ నుంచి రావడం లేదు.మొదటి సారి అశ్వినీదత్ కూతురు మహానటి ప్రొడ్యూసర్ స్వప్న దత్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఒక నవల ఆధారంగా వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తోంది.

బలభద్రపాత్రుని రమణి అందించిన కథతో గోమ్‌టేశ్‌ ఉపాధ్యే దర్శకత్వం తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా నిత్యా మీనన్ ని ఫైనల్ చేశారు.

కథ నచ్చడంతో ఆమె కూడా ఒకే చెప్పేసింది.ఈ సిరీస్‌కి నటుడు, దర్శకుడు అవసరాల స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌తో పాటు క్రియేటివ్‌ డెసిషన్లలో పాలుపంచుకుంటారని తెలుస్తుంది.డిసెంబర్‌ లేదా జనవరిలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లో కుటుంబ బాధ్యతలలో ఇమిడి ఉన్న ఓ మహిళ కథని చెప్పబోతున్నారు.

మహిళల సమస్యలపై ఈ వెబ్ సిరీస్ ద్వారా స్పృశించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube