అలా మొదలైంది అంటూ తెలుగు వారిని పలకరించి టాలీవుడ్లో జెండా పాతిన ముద్దుగుమ్మ నిత్యామీనన్ గత కొన్ని నెలలుగా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో అనేక పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
నిత్యామీనన్ సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం ఎక్కువగా జరిగింది.ఇదే సమయంలో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి.
పెళ్లి చేసుకున్న నిత్యామీనన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందనే వాదన ఎక్కువగా వినిపించింది.
తాజాగా తన బ్రీత్ 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కాబోతున్న సందర్బంగా స్పందించింది.
ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఈ అమ్మడు అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు.జనాలకు ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు ఇంత ఆసక్తి ఉంటుందంటూ ప్రశ్నించింది.
మీడియా రంగంలోని కొందరు పుకార్లు పుట్టించి వారి రేటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించింది.
ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని పేర్కొంది.
కొన్ని కారణాల వల్ల చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజమే కాని అది మీరు అనుకున్నట్లుగా మాత్రం కాదని పేర్కొంది.త్వరలోనే మళ్లీ సినిమాల్లో నటించబోతున్నట్లుగా పేర్కొంది.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఒక మలయాళ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్గా ఎంపిక అయ్యిందని సమాచారం అందుతోంది.అది కాకుండా తెలుగు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేసేందుకు రెడీగా ఉందట.