తెలుగులో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించినటువంటి “అలా మొదలైంది” అనే చిత్రంలో నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది కోలీవుడ్ ముద్దుగుమ్మ నిత్య మీనన్. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకని తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది.
అంతేగాక విభిన్న ప్రయోగాలు చేయడంలో నిత్య మీనన్ ఎప్పుడూ ముందు ఉంటుంది.అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల కొంత బొద్దుగా తయారైంది.
దీంతో ఈ అమ్మడి ఫోటోలను చూసినటువంటి కొందరు నెటిజన్లు బరువు తగ్గాలంటూ కామెంట్ చేయగా తనకు తన బరువు విషయంలో సరైన క్లారిటీ ఉందని ఇతరుల చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.అయితే తాజాగా నిత్య మీనన్ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా తన అందాలతో ఫోటోలకి పోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలను సరిగ్గా గమనిస్తే నిత్య మీనన్ సినిమాల కోసం కొంత మేర బరువు తగ్గినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గత కొద్ది కాలంగా సినిమాలు లేక లావుగా తయారైయినటువంటి నిత్య మీనన్ ఒక్కసారిగా ఇంతలా బరువు తగ్గిపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం నిత్యామీనన్ సన్నగా ఉండటం కంటే బొద్దుగా ఉంటేనే చాలా బాగుంటుందని అభిప్రాయం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిత్య మీనన్ కొలంబి అనే మలయాళం చిత్రంలో లో ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు టీ కేకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే తమిళ భాషకు సంబందించిన ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.అయితే ఈ చిత్రం విడుదల కాలేదు.