మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు ఈ సమాజంలో చాల అరుదుగా కనిపిస్తారు.అదే సినీ పరిశ్రమలో అయితే టార్చ్ లైట్ వేసి వెతికితే ఒకరో ఇద్దరో తారసపడతారు.
అలాంటి వీరిలో నిత్యా మీనన్ ఒకరని, ఆమె తాజా వ్యాఖ్యలతో స్పష్టం అవుతుంది.అందం,అభినయం సమపాళ్లలో ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తుంది.
దీనికి గల కారణం గురించి ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.తెలుగు సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని, హీరో అల్లరి చిల్లరిగా తిరుగుతూ హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడని…అతన్నే హీరోయిన్ ప్రేమిస్తుందని, ఆ తర్వాత హీరోయిన్ ని ఇంటికి చేర్చటమో లేక విలన్ మీద పగ తీర్చుకోవటం జరుగుతుంది.
అంతకు మించి తెలుగు సినిమాల్లో ఏమి ఉంటాయని…అందుకే తెలుగు సినిమాలను చేయటం లేదని స్పష్టం చేసింది నిత్యా.అలా ఒకే తరహా సినిమాల్లో నటించటం వలన ఆనందం,సంతృప్తి రెండు ఉండవని….
మూస సినిమాల్లో చేయటం తనకు ఇష్టం ఉండదని, విభిన్నమైన పాత్రలను చేయాలనీ తన మనస్సులోని మాటను బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.