తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “అలా మొదలైంది” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ కుట్టి బొద్దుగుమ్మ “నిత్యా మీనన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నిత్యా మీనన్ వచ్చి రాగానే హిట్ అందుకోవడంతో స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని తనకంటూ తమిళ, మలయాళ, తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో నిత్యా మీనన్ సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించినట్లు తెలుస్తోంది. అంతేకాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలను మాత్రమే అంగీకరిస్తూ విభిన్న కథనాలను ఎంచుకుంటుంది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలకు దూరంగా ఉండే నిత్యా మీనన్ ఈ మధ్య కొంత మేర బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని అందమైన ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే నిత్యా మీనన్ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బాగా బరువు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
దీంతో సినిమా అవకాశాల కోసమే నిత్యా మీనన్ బరువు తగ్గినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఆ మధ్య కొందరు ఏకంగా నిత్యా మీనన్ ని మీరు ఈ మధ్య కాలంలో బరువు బాగా పెరిగారని కామెంట్ చేయడంతో నా బరువు గురించి నాకు తెలుసని మీరు పెద్దగా దిగులు పడకండని ఘాటుగా సమాధానం చెప్పింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిత్యా మీనన్ తెలుగులో “గమనం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకురాలు “సృజన రావు” దర్శకత్వం వహిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.దీంతో “నిన్నిలా నిన్నిలా” అనే మరో తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల కాగా మంచి స్పందన లభించింది.