పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున వీలైనన్ని సినిమాలు చేయాలనీ పవన్ అనుకుంటున్నాడు.
అందుకే ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసారు.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వెండితెర మీద కనిపించబోతున్నాడు.
అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.అంజలి, నివేతా థామస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తుంది.
ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు.ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9 న విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోసియమ్ సినిమా రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలను పవన్ ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.ఈ మలయాళ సినిమా రీమేక్ లో హీరోయిన్ కోసం ముందుగా సాయి పల్లవి ని అనుకున్నారు.
ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి కూడా ఓకే చెప్పింది.అయితే డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఈ సినిమాకు సాయి పల్లవి నో చెప్పింది.
దీంతో మళ్ళీ చిత్ర యూనిట్ పవన్ కు జోడీగా మరొక హీరోయిన్ ను వెతకడం మొదలు పెట్టారు.అయితే పవన్ కు జోడీగా నటించేందుకు నిత్యా మీనన్ ఒప్పుకున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.ఈయనకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాను సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.