ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు చేసిన దర్శకుడు వివి వినాయక్ ప్రస్తుతం సినిమాలు లేక ఢీలా పడి పోయాడు.గత రెండు సంవత్సరాలుగా ఈయన సినీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
ప్రస్తుతం శీనయ్య అనే చిత్రాన్ని మొదలు పెట్టి దాన్ని మద్యలో వదిలేశాడు.కొన్ని కారణాల వల్ల హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా కూడా సాధ్యం కాలేదు.
మళ్లీ వినాయక్ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సమయంలో ఒక యంగ్ హీరోను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.
నితిన్ హీరోగా వినాయక్ గతంలో ఒక సినిమాను తెరకెక్కించాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తాజాగా ప్రముఖ రచయితతో తయారు చేయించిన కథను నితిన్కు వినిపించాడట.ఆ కథ నితిన్కు నచ్చడంతో వినాయక్ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడట.
కాని ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.ఆ మూడు సినిమాల తర్వాత వినాయక్కు డేట్లు ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నితిన్ హీరోగా రూపొందిన రంగ్దే చిత్రం విడుదల కావాల్సి ఉంది.ఆ తర్వాత అంధాదున్ రీమేక్లో నితిన్ నటించనున్నాడు.ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత పవర్ పేట అనే భారీ చిత్రాన్ని నితిన్ కమిట్ అయ్యాడు.భారీ బడ్జెట్ చిత్రం అవ్వడంతో వచ్చే ఏడాది వరకు నితిన్ ఖాళీ లేడు.2022 సంవత్సరంలో వినాయక్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట.మరి వినాయక్ అప్పటి వరకు వెయిట్ చేస్తాడా లేదంటే మరో సినిమాకు కమిట్ అవుతాడా అనేది చూడాలి.