టాలీవుడ్ యుంగ్ హీరో నితిన్ వచ్చే ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయిపోయాడు.భీష్మ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన నితిన్ వచ్చే ఏడాది చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాతో పాటు, వెంకీ అట్లూరి దర్శకత్వం రంగ్ దే ద్వారా ప్రేక్షకుల ముందుకి ఏడాది ఆరంభంలోనే రానున్నాడు.
ఈ రెండు సినిమాలు షూటింగ్ మేగ్జిమమ్ పూర్తి చేసేశాడు.ముందు చెక్ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కి చెక్ పెట్టేసి రంగ్ దే షూటింగ్ లో జాయిన్ అయ్యి దానిని దుబాయ్ లో పూర్తి చేసి ఇప్పుడు నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా దుబాయ్ లో స్టార్ట్ చేసేశాడు.
రంగ్ దే తర్వాత నితిన్ హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.
క్రైమ్ మర్డర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.నితిన్ తండ్రి దీనిని నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే దుబాయ్ వేదికగా ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ని దర్శకుడు మేర్లపాక స్టార్ట్ చేశాడు.ఈ విషయాన్ని నితిన్ ట్వీట్ చేశారు.
ఆయనతో పాటు హీరోయిన్ నభా నటేశ్ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.ఇందులో మరో హీరోయిన్ తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది.
హీరోయిన్, ఐటెం సాంగ్స్ కాకుండా మొదటి సారి తమన్నా విభిన్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తుంది.హిందీలో టబు చేసిన ఈ పాత్రకి జాతీయ అవార్డు వచ్చింది.
అలాంటి పాత్రలో తమన్నా కనిపించబోతుంది.ఇదిలా ఉంటే జనవరి నుంచి జరగనున్న తదుపరి షెడ్యూల్లో ఆమె షూటింగ్ లో పాల్గొంటారు.