ఒకప్పుడు హీరోలు అంటే కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే చేసేవారు.వారికి నటన తప్ప మరే ఆలోచన ఉండేది కాదు.
కొంతమంది హీరోలు దర్శకత్వం నిర్మాణంలో తమ ప్రతిభను కనబరిచేందుకు ప్రయత్నించేవారు.కానీ ఎక్కువ శాతం హీరోలు మాత్రం కేవలం నటించడం తోనే సరిపెట్టారు.
కానీ ఈ తరం హీరోలు అలా కాదు.హీరోలుగా నటించడంతో పాటు పలు వ్యాపారాల్లో తమదైన భాగస్వామ్యం కలిగి ఉండడం ఆ వ్యాపారాలకు తమ బ్రాండ్ వాల్యూ కల్పి మంచి వ్యాపారం సామ్రాజ్యాన్ని విస్తరించడం చేస్తున్నారు.
పలువురు హీరోలు వ్యాపారాలు చేయడమే కాకుండా ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లల్లో సంపాదన పొందుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి పది కోట్లకు పైగా డబ్బు బ్రాండ్ అంబాసిడర్ గా నటించడం వల్లే సంపాదిస్తాడట.
ఆయనంత కాకున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు హీరోలు కూడా బ్రాండ్స్ తో సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒక ప్రాజెక్టు కోసం యాడ్ లో నటించడం జరిగింది.
ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇప్పుడు నితిన్ కూడా ఒక యాడ్ లో నటించాడు.
ఆ యాడ్ చిత్రీకరణ జరుగుతున్నట్లు స్వయంగా నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు.మొదటి యాడ్ షూట్ అంటూ ట్విట్టర్లో నితిన్ స్వయంగా ఈ ఫోటోలను షేర్ చేశాడు.
మొత్తానికి యంగ్ హీరోలు కూడా కమర్షియల్ బాట పట్టడంతో వాళ్ల ఆదాయం డబుల్ ఆశిస్తున్నారని అర్థమవుతుంది.వీరికి కమర్షియల్స్ కు పారితోషకం ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే రంగ్ దే చివరి దశ షూటింగ్ జరుగుతోంది.చాలా నెలల తర్వాత ఇటేవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది.
ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా నితిన్ లైన్ లో పెట్టాడు.