నితిన్ కెరీర్ ఆరంభంలో దారుణ పరాజయాలు మూట కట్టుకున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం ఈయన కెరీర్ గాడిలో పడినది.
భీష్మ చిత్రంతో మరో సక్సెస్ను దక్కించుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.మూడు సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా రెండు సినిమాలు కూడా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.
అయితే ఈయన వరుసగా యంగ్ డైరెక్టర్స్తో చిత్రాలు చేస్తూ యూత్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
భీష్మ చిత్రం కోసం వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను చేసిన నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమా విడుదల కాకుండానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాధున్ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.ఇదే సమయంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా ఈయన ఒక సినిమాను చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి నితిన్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకుంటున్నాడు.యూత్ ఫుల్ సక్సెస్ను దక్కించుకున్న దర్శకులను నితిన్ పట్టుకుని సినిమాలు చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది.నితిన్ భీష్మ చిత్రం సక్సెస్ నేపథ్యంలో ఈ ఏడాది మరో రెండు లేదా మూడు సినిమాలను విడుదల చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.