యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమా ద్వారా కెరియర్ లో వరుస ఫ్లాప్ ల తర్వాత మరల అదిరిపోయే హిట్ కొట్టాడు.ఇష్క్ తర్వాత ఎక్కువగా ప్రేమకథలతోనే వస్తున్న నితిన్ కెరియర్ మరల ఈ మధ్య గాడి తప్పింది లై సినిమా నుంచి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చాయి.
అయితే ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న నితిన్ భీష్మతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.నితిన్ ఆశించినట్లే ఆడియన్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేసి అతనికి ఆనందం అందించారు.
ఈ సినిమాకి కలెక్షన్స్ ప్రస్తుతం దుమ్ము దులుపుతున్నాయి.నితిన్ కెరియర్ లో బెస్ట్ మూవీలలో ఒకటిగా ఈ భీష్మ నిలిచిపోయింది.
ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకి కూడా ఈ సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
యువ హీరో నాగ శౌర్య వెంకీ మీద భీష్మ రిలీజ్ కి ముందు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
తనకి అసలు కథ రాయడం రాదనే విధంగా అవమానిస్తూ మాట్లాడాడు.నా దగ్గరకి వెంకీ ఒక చెత్త కథని తీసుకొని వస్తే ఆ విషయాన్ని చెప్పి తాను కూర్చొని చలో కథని సిద్ధం చేసి వెంకీ చేతిలో పెట్టానని చెప్పాడు.
తాను చలో సినిమాకి క్రెడిట్ కూడా తీసుకోలేదని, అది తన తప్పే అని అన్నాడు.చలో హిట్ తర్వాత వెంకీ తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేసాడని, తన తల్లి ఇచ్చిన కారుని కూడా ఉపయోగించలేదని చెప్పాడు.
అయితే వీనికి వెంకీ ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు.శౌర్య తనని అవమానించి మాట్లాడిన ప్రతి మాటకి భీష్మ సక్సెస్ తో సమాధానం ఇచ్చినట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ మీట్ లో వెంకీ మాట్లాడుతూ ఉండగా చివర్లో నితిన్ మైక్ తీసుకొని ఈ కథ నువ్వే రాశావ్ కథా అని సెటైర్ వేసాడు.ఈ సెటైర్ డైరెక్ట్ గా నాగ శౌర్యని దృష్టిలో ఉంచుకొని వేసిందే అని అర్ధమవుతుంది.
మరి శౌర్య వ్యాఖ్యలకి సక్సెస్ తో వెంకీ సమాధానం చెప్పాడని టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో అతను ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.