ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నటువంటి “రంగ్ దే” అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అంతేకాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తయిన ట్లు సమాచారం.దీంతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మధ్యకాలంలో చిత్రీకరణ మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
అయితే అందుకు కారణాలు లేకపోలేదు.ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు వెంకీ అట్లూరి బాగానే శ్రమిస్తున్నాడు.
ఇందులో ప్రేమకోసం జైలుకి వెళ్లినటువంటి యువకుడి పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు.దీంతో మరో సరికొత్త ప్రయోగాన్ని నితిన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందుండే నితిన్ ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో నితిన్ నటించిన టువంటి భీష్మ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బాగానే ఆకట్టుకుంది.అంతేగాక దర్శకనిర్మాతలు కూడా కాసుల పంట పండించింది.
దీంతో నితిన్ ఇదే ఊపులో తన రంగ్ దే చిత్రాన్ని కూడా విడుదల చేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.ప్రస్తుతం హీరో నితిన్ ఒక పక్క పెళ్లి పనులు మరోపక్క షూటింగ్ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.