యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా గత ఏడాది సమ్మర్ చివర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు విడుదలకు నోచుకోలేదు.
సినిమా షూటింగ్ ను గత ఏడాదిలోనే పునః ప్రారంభించారు.వెంటనే పూర్త చేస్తామని చెప్పిన నితిన్ కాస్త ఆలస్యం చేస్తున్నాడు.
అదుగో ఇదుగో అంటూ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.సినిమా షూటింగ్ విషయంలో ఆలస్యం చేసినట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు సాగతీస్తున్నారు.
రంగ్ దే సినిమా కంటే వెనుక ఆరంభం అయిన సినిమాలు విడుదల తేదీ ప్రకటించుకున్నాయి.కాని ఇప్పటి వరకు రంగ్ దే గురించిన క్లారిటీ ఇవ్వడంలో యూనిట్ సభ్యులు వెనుకబడి పోయారు.
మరో వైపు నితిన్ నటిస్తున్న చెక్ సినిమా హడావుడి మామూలుగా లేదు.చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమా కంటే చాలా ముందు రంగ్ దే రావాల్సి ఉంది.కాని రంగ్ దే సాగతీత కారణంగా ఆలస్యం అవుతుంది.ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.సినిమా విడుదలకు సిద్దం అయినా కూడా విడుదల తేదీ విషయంలో ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఇప్పట్లో రంగ్ దే సినిమా విడుదలకు మంచి తేదీ లేనే లేదు.
దాంతో రంగ్ దే సినిమా విషయంలో అభిమానులు మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.ప్రస్తుతం రంగ్ దే సినినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి.కనుక మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఈ సినిమా నితిన్ కెరీర్ లో ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.