యంగ్ హీరో నితిన్ ఒక హిట్ మూడు ఫ్లాప్లు అన్నట్లుగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు.సుదీర్ఘ కాలం ఫ్లాప్లు వచ్చినా కూడా కెరీర్ను నెట్టుకు వచ్చి ఆమద్య కాస్త సందడి చేసిన నితిన్ మళ్లీ మూస పద్దతిలోనే పడి పోయాడు.
వరుసగా చల్ మోహన్ రంగ మరియు శ్రీనివాస కళ్యాణం చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో నితిన్ ఆలోచనల్లో పడ్డాడు.ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన ‘భీష్మ’ చిత్రంకు అనేక మార్పులు చేర్పులు చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.
అసలు ఆ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా మొదలు అయ్యాయి.దాంతో ఇటీవలే త్వరలోనే భీష్మను పట్టాలెక్కించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఒక వైపు భీష్మ చిత్రంలో నటిస్తూనే మరో వైపు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంకు సీక్వెల్ను నితిన్ చేయనున్నాడా అనే టాక్ వినిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్కు గతంలో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో సక్సెస్ను ఇచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరో ప్రయత్నం చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే స్టోరీ సిట్టింగ్స్ కూడా పూర్తి అయ్యాయి.స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఇదే సంవత్సరంలో సినిమాను చేయాలి, తీసుకు రావాలనే పట్టుదలతో నితిన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం నితిన్ కెరీర్లో నిలిచిపోయేలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా నితిన్కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.జూన్ లేదా జులైలో ఈ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.ఇదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.భీష్మ మరియు ఈ సీక్వెల్ సినిమాలు నెల లేదా రెండు నెలల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.