టాలీవుడ్ లో నాగచైతన్య రష్మిక మందన్నలు నటించిన చలో చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మ అనే చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఓ గెస్ట్ రోల్ లో హెబ్బా పటేల్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్యనే చిత్ర యూనిట్ సభ్యులు తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రోజు భీష్మ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్ర టీజర్ ని ఈ నెల 12వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో నితిన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నా నితిన్ మాత్రం తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.
గతంలో వచ్చినటువంటి చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.దీంతో నితిన్ కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.అయితే నితిన్ చివరిసారిగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన టువంటి గద్దల కొండ గణేష్ చిత్రంలో ఓ సన్నివేశంలో కనిపించాడు.
అయితే ఇప్పటికే భీష్మ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది.దీంతో దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రం కూడా చలో సినిమా తరహాలోనే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
.