నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సత్తా చూపిస్తున్నాడు.మొన్నటి వరకు తన సొంత సినిమాలకే నిర్మాతగా ఉన్న కళ్యాణ్ రామ్ తర్వాత రవితేజ తో కిక్ 2, తమ్ముడు తారక్ తో జై లవకుశ సినిమాలు నిర్మించాడు.
వీటిలో జై లవకుశ మంచి లాభాలు తెచ్చి పెట్టింది.ఇదిలా ఉంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా తన ప్రొడక్షన్ ద్వారా తీయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు.
అందులో భాగంగా ముందుగా యువ హీరో నితిన్ ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
తాజాగా భీష్మ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ హిందీ అంధాదున్ రీమేక్ తో పాటు, వెంకి అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలు మొదలయ్యాయి.కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ కి వెళ్తాయి.ఇదిలా ఉంటే యువ దర్శకులు ఇప్పుడు కొత్త కథలతో నితిన్ చుట్టూ తిరుగుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో నటించడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నట్లు సమాచారం.మల్టీ స్టారర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాని కూడా త్వరలో అఫీషియల్ లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొత్తానికి వరుస సినిమాలతో ఇప్పుడు నితిన్ మంచి స్పీడ్ మీద ఉన్నాడని ప్రస్తుతం అతను చేయబోతున్న సినిమాలు చూస్తూ ఉంటే తెలుస్తుంది.ఈ స్పీడ్ ని ఎంత వరకు నితిన్ కొనసాగిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.