భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో నితిన్ ఇప్పుడు మంచి జోరు మీద వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.ఓ వైపు రంగ్ దే సినిమాని వెంకి అట్లూరి దర్శకత్వంలో చేస్తూనే మరో వైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ రెండూ షూటింగ్ చివరి దశకి వచ్చేయడంతో హిందీ అందాధున్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.
షూటింగ్ కి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు మేర్లపాక లోకేషన్స్ వేటలో పడ్డాడు.ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా నేటివిటీకి సింక్ అయ్యే విధంగా గోవాని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.
దర్శకుడు మేర్లపాక గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్ ప్రస్తుతం గోవాలో లొకేషన్లను ఎంపిక చేస్తున్నారు.ఈ విషయాన్ని తెలుపుతూ సాహి సురేశ్ అక్కడి తమ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మెజారిటీ షూటింగ్ గోవాలో పూర్తి చేయాలని, కొన్ని సన్నివేశాలు ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నారు.దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.
నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వీలైనంత వేగంగా ఈ సినిమా పూర్తి చేసి కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే పవర్ పేట సినిమాకి సిద్ధం కావాలని నితిన్ అనుకుంటున్నాడు.
ఇక అందాధున్ రీమేక్ లో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ఉండగా హీరోయిన్ గా నభా నటేష్ ని ఫైనల్ చేశారు.