అఖిల్ మొదటి సినిమాను పోటిగా దింపడం ఎందుకు అని కొందరు భయపెడుతుంటే , … నితిన్ మాత్రం తన పని తానూ చేసుకుంటూపోతున్నాడు.పోటి లో గెలిస్తేనే మజా అని భావిస్తున్నాడు.
అక్కినేని అఖిల్ ” అఖిల్- పవర్ ఆఫ్ జువా” ఈ నెల 22 న విడుదల కానున్న విషయం తెలిసిందే.అయితే పోటిలో రామ్ చరణ్ బ్రూస్ లీ ఇదే నెల 16న ఉన్నందున నిజంగానే విడుదల చేస్తారా లేదా అని సంశయించారు.
ఇదంతా ఏమి పట్టించుకోను, రిలీజ్ చేసే తీరుతా అంటున్నాడు నితిన్.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, పోటి వద్దని నాగార్జున ఎంత చెప్పిన నితిన్ వినలేదట.
సినిమా మీద నితిన్ నమ్మకాన్ని ప్రదర్శించి, గట్టిగా కొడ్తున్నాం అని భరోసా ఇచ్చాడట.ఈ వార్తను బట్టి చుస్తే, ఎట్టి పరిస్థితిల్లో అయినా రామ్ చరణ్, అఖిల్ ల మధ్య పోటి తప్పేలా లేదు.
అటు వైపు రామ్ చరణ్ ఒక్కడే లేదు, ఈసారి మెగాస్టార్ ని కుడా కలిపేసుకొని వస్తున్నాడు.కొత్త కుర్రాడు అఖిల్ ఆ పదునుని తట్టుకొని నిలుస్తాడా లేదా చూడాలంటే 22 వరకు ఆగాల్సిందే.