2002వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించినటువంటి “జయం” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తెలుగులో దాదాపుగా 25 చిత్రాలకి పైగా హీరో గా నటించిన టువంటి నితిన్ కెరియర్ లో బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి కరోనా వైరస్ ఎంతగానో కలకలం సృష్టిస్తుంది.దీని వల్ల ఇప్పటికే రాష్ట్రాల్లో అత్యవసరం సేవలు తప్ప మిగిలిన అన్ని సేవలను ప్రభుత్వం వారు బంద్ చేశారు.
అంతేగాక రాష్ట్రంలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసి కరోనా లక్షణాలతో బాధ పడుతున్నవారికి చికిత్స అందిస్తున్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన వంతు సహాయ సహకారాలను అందించారు.
ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 20లక్షల రూపాయలను విరాళంగా అందించారు.అయితే నితిన్ అందించినటువంటి ఈ విరాళన్ని ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించేందుకు చేపట్టేటువంటి సహాయ కార్యక్రమాలకు వినియోగించనుంది.
అయితే యంగ్ హీరో నితిన్ చేసినటువంటి ఈ పనిని టాలీవుడ్ పలువురు సినీ పరిశ్రమ పెద్దలు అభినందిస్తున్నారు.అంతేగాక మరికొంత మందిని తమ వంతు సహాయం చేయాలంటూ పిలుపునిస్తున్నారు.అయితే రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుంటారనడంలో ఎటువంటి సందేహము లేదు.గతంలో కూడా విశాఖపట్టణంలో హుదూద్ తుఫాన్ ప్రళయం సృష్టించినప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే.