బాలీవుడ్ లో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా అంధాదున్.ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, టబు ప్రధానమైన పాత్రలతో నటించారు.
సినిమాలో ఆయుష్మాన్ అంధుడుగా కనిపిస్తాడు.క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా తెరకెక్కింది.
ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఈ సినిమాలో క్యారెక్టర్ గా బెస్ట్ యాక్టర్ గా ఆయుష్మాన్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది.ఇప్పుడు దీనిని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళంలో ఈ సినిమా ద్వారా సీనియర్ హీరో ప్రశాంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు.
తెలుగులో యంగ్ హీరో నితిన్ ఈ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు.
తాజాగా భీష్మ ప్రమోషన్ లో ఈ రీమేక్ గురించి నితిన్ కన్ఫర్మ్ చేశాడు.కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ కొట్టిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు.
అంధాదున్ ఆయుష్మాన్ కి జాతీయ అవార్డు వచ్చిందని, అది కొంత వరకు తాను ఎలా చేయాలనే విషయం మీద ఆందోళనకి గురిచేస్తుందని అన్నాడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేయడం జరిగిందని తెలిపాడు.ఇక సమ్మర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు.
ఆయుష్మాన్ స్థాయిలో పెర్ఫార్మ్ చేయడానికి తాను మరింత కష్టపడాల్సి ఉందని నితిన్ చెప్పాడు.