యంగ్ హీరో నితిన్ గత ఏడాది ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా శతమానం భవతి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని నితిన్ చాలా నమ్మాడు.
అంతగా నమ్మి చేసిన సినిమా నట్టేటా ముంచింది.శ్రీనివాస కళ్యాణం మరీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.
దాంతో నితిన్ తదుపరి చిత్రంను చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు.నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్రంను చేస్తున్నాడు.2019వ సంవత్సరంలో భీష్మ చిత్రం వస్తుందని మొదట ప్రచారం జరిగినా షూటింగ్ ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అన్నారు.
షూటింగ్ నెదానంగా చేస్తే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.కాని కాస్త హడావుడిగా పూర్తి చేస్తే ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల చేసే అవకాశం ఉంది.ఇప్పటి వరకు ఏ హీరో కూడా స్రిస్మస్పై కర్చీఫ్ వేయలేదు.
అందుకే నితిన్ అండ్ టీం కాస్త తొందరగా సినిమా షూటింగ్ను పూర్తి చేసి క్రిస్మస్కు విడుదల చేయాలని భావించారు.ఇప్పటికే ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.
ఫస్ట్లుక్ విడుదల చేయకుండానే ఫ్రీ లుక్ విడుదల చేసి విడుదల విషయంలో ముందే కర్చీఫ్ వేశారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నారు.
నితిన్ సక్సెస్ కొట్టి చాలా కాలం అయ్యింది.త్రివిక్రమ్తో చేసిన అఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకున్నా అది నితిన్ ఖాతాలో పడలేదు.త్రివిక్రమ్ మరియు సమంతలకు ఆ సక్సెస్ దక్కింది.అందుకే ఇప్పుడు నితిన్ భీష్మ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని మరీ చేస్తున్నాడు.మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.క్రిస్మస్కు పోటీ లేకపోవడం భీష్మకు దక్కిన లక్ అనుకోవాలి.
మరి ఈ లక్ను నితిన్ వినియోగించుకుని సక్సెస్ అవుతాడా చూద్దాం.