నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.నిన్న ట్రైలర్ విడుదల క్యాక్రమం జరిగింది.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత కాస్త నిరాశ పర్చేలా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సినిమాలో ఆర్గానిక్ ఫార్మింట్ అంటూ హీరో చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో వచ్చిన ఛలో చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కాని ప్రస్తుత పరిస్థితి వేరేగా ఉంది.ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నితిన్ కోరుకుంటున్నాడు.ఎందుకంటే ఆయన గత చిత్రం శ్రీనివాస కళ్యాణం నిరాశ పర్చింది.దాంతో గత ఏడాది మొత్తం ఆయన సినిమాలే చేయలేదు.సినిమాను చేస్తే సక్సెస్తోనే అనే ఉద్దేశ్యంతో నితిన్ సినిమాను వాయిదా వేస్తూ వచ్చి ఈ సినిమాను చేయడం జరిగింది.
ఇటీవలే నితిన్ వివాహ నిశ్చితార్థం జరిగింది.ఏప్రిల్లో వివాహం ఉండబోతుంది.
ఈ సినిమా ఫలితం పాజిటివ్ అయితే నితిన్ సంతోషంగా వివాహం చేసుకోవచ్చు.ఫలితం తేడా కొడితే మాత్రం ఆయన జీవితంలో చాలా లోటుగా భావిస్తాడు అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.మొత్తానికి ఈ చిత్రం తేడా కొడుతుంది అంటూ కొందరు నెటిజన్స్ చేస్తున్న వ్యాఖ్యలతో అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.సినిమాకు మాత్రం కొందరు చాలా పాజిటివ్ ఆలోచనతో ఎదురు చూస్తున్నారు.
మరి ఏం జరిగేనో చూడాలి.