ఈ ఏడాది టాలీవుడ్ హీరోలైన నిఖిల్, రానా, నితిన్ లు పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.అయితే వీరి పెళ్లి ఎప్పుడో జరగాల్సి ఉన్న కరోనా ఎఫెక్ట్ కారణంగా కొంత గ్యాప్ వచ్చింది.
అయితే నిఖిల్ మాత్రం ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకొని ఒక రిసార్ట్ లో తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.ఇక రానా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
ముహూర్తాలు కూడా నిర్ణయించేశారు.ఇక పెళ్లి వేడుక దగ్గర పడటంతో ఈ జంటలు టాలీవుడ్ లో సందడి చేస్తున్నారు.
వీరికి సంబందించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే హీరో నితిన్ ఈ రోజు తన ప్రియురాలు షాలినితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభం కాగా, మెహందీ ఫంక్షన్ చిత్రాలు వైరల్ అయ్యాయి.నితిన్ ఎంతగానో అభిమానించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెహిందీ ఫంక్షన్ కి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఇక ఈ రోజు రాత్రి 8.30 గంటలకు, తాజ్ ఫలక్ నుమా హోటల్ వేదికగా, ఈ జంట ఒకటి కానుంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం సాగుతుందని ఇప్పటికే నితిన్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.పరిమిత సంఖ్యలో వధూవరుల కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఇక నితిన్ పెళ్లి సందర్భంగా ఆయనకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రంగ్ దే సినిమా టీమ్ సిద్ధమైంది.ఇప్పటికే నితిన్ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు.
ఈ నేపధ్యంలో పెళ్లి తర్వాత కరోనా ఎఫెక్ట్ తగ్గగానే సినిమాలతో నితిన్ బిజీ అయిపోతాడు.ఈ నేపధ్యంలో మళ్ళీ సినిమాలు ప్రారంభం అయినా తర్వాత అంటే ఇబ్బంది అని కష్టమైన ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాడు.