అక్కినేని అఖిల్ మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ మూడు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పర్చాయి.
ఏమాత్రం ఆకట్టుకోని కథనాలు మరియు కథలతో ఆ సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబోలో సినిమాను సమ్మర్లో విడుదల చేయాల్సి ఉంది.కాని కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.
అఖిల్ 4వ సినిమా విషయంపై క్లారిటీ రాకుండానే 5వ చిత్రంపై ప్రచారం మొదలు అయ్యింది.అఖిల్5వ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.కాని సినీ వర్గాల్లో మాత్రం వీరిద్దరి కాంబో మూవీని నితిన్ నిర్మించబోతున్నట్లుగా చెబుతున్నారు.నితిన్ గతంలో అఖిల్తో ‘అఖిల్’ చిత్రాన్ని నిర్మించి ఏకంగా 30 కోట్ల రూపాయలను లాస్ అయ్యాడు.
అఖిల్తో అంత లాస్ అయినా కూడా మళ్లీ ఆయనతో సినిమాను చేసేందుకు నితిన్ ముందుకు వస్తాడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే అఖిల్ మాత్రం తన వల్ల లాస్ వచ్చింది కనుక నితిన్కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు.పారితోషికం తీసుకోకుండానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నిర్మాణంలో చేసేందుకు అఖిల్ రెడీ అయ్యాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.