30 కోట్లు నష్టపోయినా నితిన్‌ మళ్లీ అఖిల్‌ను నమ్ముతున్నాడు

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ మూడు కూడా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పర్చాయి.

 Nithin Again To Produce Akhils Movie 30-TeluguStop.com

ఏమాత్రం ఆకట్టుకోని కథనాలు మరియు కథలతో ఆ సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

వీరిద్దరి కాంబోలో సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాల్సి ఉంది.కాని కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

అఖిల్‌ 4వ సినిమా విషయంపై క్లారిటీ రాకుండానే 5వ చిత్రంపై ప్రచారం మొదలు అయ్యింది.అఖిల్‌5వ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.కాని సినీ వర్గాల్లో మాత్రం వీరిద్దరి కాంబో మూవీని నితిన్‌ నిర్మించబోతున్నట్లుగా చెబుతున్నారు.నితిన్‌ గతంలో అఖిల్‌తో ‘అఖిల్‌’ చిత్రాన్ని నిర్మించి ఏకంగా 30 కోట్ల రూపాయలను లాస్‌ అయ్యాడు.

Telugu Akhil, Nithin, Nithinproduce-Movie

అఖిల్‌తో అంత లాస్‌ అయినా కూడా మళ్లీ ఆయనతో సినిమాను చేసేందుకు నితిన్‌ ముందుకు వస్తాడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే అఖిల్‌ మాత్రం తన వల్ల లాస్‌ వచ్చింది కనుక నితిన్‌కు మళ్లీ ఛాన్స్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు.పారితోషికం తీసుకోకుండానే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ నిర్మాణంలో చేసేందుకు అఖిల్‌ రెడీ అయ్యాడు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube