టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన రెండు చిత్రాలను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.చెక్, రంగ్ దే చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో.
అయితే గతేడాది భీష్మ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ అందుకున్న ఈ హీరో, ఈ యేడు కూడా తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.ఇక ఈ రెండు సినిమాల తరువాత తన నెక్ట్స్ మూవీగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అంధాధున్’ రీమేక్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమాతో పాటు తన కెరీర్లో అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘ఇష్క్’ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించేందుకు కూడా నితిన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఇష్క్ చిత్రం అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రిలీజ్ అయ్యి 9 ఏళ్లు పూర్తి కావడంతో దర్శకుడు విక్రమ్ కుమార్తో కలిసి నితిన్ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అయితే ‘తమ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా ‘ఇష్క్’ నిలిచిందని, అందుకే మరోసారి మేము కలిసి పనిచేయబోతున్నాము’ అనే ట్వీట్ను దర్శకుడు విక్రమ్ కుమారో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.
దీంతో వారిద్దరు కలిసి చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇష్క్ సీక్వెల్ అయి ఉంటుందని చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.నితిన్ హీరోగా, అందాల భామ నిత్యా మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన ఇష్క్, అదిరిపోయే సంగీతంతో మ్యూజికల్ హిట్గా నిలవడమే కాకుండా ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్కు అదిరిపోయే కమ్బ్యాక్ చిత్రంగా నిలిచింది.
అందుకే తన కెరీర్లో ఇష్క్ ఖచ్చితంగా ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుందని నితిన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమా సీక్వెల్ను ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది తెలియాలంటే మరొకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.