యంగ్ హీరో నితిన్ ఈయేడు భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
అయితే కరోనా మహమ్మారి అందరి అంచనాలను తలకిందులు చేసేసింది.ఇక కరోనా నేపథ్యంలోనే లాక్డౌన్లో పెళ్లిపీటలెక్కాడు ఈ కుర్ర హీరో.
కాగా తన నెక్ట్స్ మూవీ ‘రంగ్దే’ షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.
ఇక తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నితిన్.
ఈ క్రమంలో బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన అంధాధున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకుడు మేర్లపాక గాంధీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా ఒరిజినల్ వర్షన్లో బోల్డ్ పాత్రలో ముదురు బ్యూటీ టబూ నటించింది.
ఆమె పాత్ర సినిమాకు హైలైట్గా నిలవడంతో, ఇప్పుడు తెలుగు రీమేక్లో ఆ పాత్రను ఎవరితో చేయించాలా అని నితిన్ అండ్ టీమ్ తెగ ఆలోచిస్తున్నారు.
అయితే రమ్యకృష్ణ లాంటి పేర్లు వినిపించినా, ఎందుకో ఈ బోల్డ్ పాత్రలో నటించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక ఆ పాత్రలో నటించేందుకు టబూనే సంప్రదించారట.బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ను క్రియేట్ చేసుకున్న టబూ, ఇటీవల అల వైకుంఠపురములో సినిమాలో నటించి మెప్పించింది.
ఇప్పుడు అంధాధున్ రీమేక్లో నటిస్తుండటంతో ఆమె ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.