నితిన్.ఈయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు అవుతుంది.
ఈ 20 ఏళ్లలో ఎన్నో హిట్ సినిమాలు మరెన్నో ప్లాప్ సినిమాలను కూడా చూసాడు.నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ కాబోతుంది.
నితిన్ నుండి చాలా రోజుల తర్వాత ఒక మాస్ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఘనంగా చేసారు.ఈ ఈవెంట్ లో నితిన్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది.
నితిన్ మాట్లాడుతూ.
నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది.మరొక 20 ఏళ్ళు మీ ప్రేమ, సపోర్ట్ ఉంటే మీ కోసం ఇలాగె నేను కష్టపడుతా.ప్రేక్షకుల, అభిమానుల సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు.
మీ అభిమానానికి థాంక్స్.నా మనసుకు దగ్గరైన సినిమా మాచర్ల నియోజకవర్గం.
ఈ సినిమాకు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా” అంటూ నితిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తుండగా. కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.
ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.
మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.