యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేశాడు ఈ హీరో.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్ దే’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మిగిలిన షూటింగ్ను యూరప్ దేశంలో చిత్రీకరించాలని చూశారు.కానీ కరోనా వైరస్ కారణంగా యూరప్ టూర్ రద్దు అయ్యింది.
దీంతో యూరప్లో జరగాల్సిన షూటింగ్ భాగాన్ని ఇక్కడే నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంది.కానీ అది పర్ఫెక్ట్గా రాదేమోనని భావించిన చిత్ర యూనిట్ తమ షూటింగ్ను యూరప్లోనే నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు.
దీంతో ఈ సినిమా మిగతా షూటింగ్ను యూరప్లోనే నిర్వహించాలని వారు ఫిక్స్ అయ్యారు.కాగా కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడగానే చిత్ర యూనిట్ యూరప్కు వెళ్లేందుకు రెడీ అవుతోంది.
మరి ఈ సినిమా మిగతా షూటింగ్ను యూరప్లోనే నిర్వహిస్తారా లేక ఇక్కడే కానిస్తారా అనేది చూడాలి.ఏదేమైనా ఈ షెడ్యూల్ షూటింగ్తో సినిమా షూటింగ్ పూర్తి కానుందని చిత్ర యూనిట్ అంటోంది.