టాలీవుడ్ లో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి.కమర్షియల్ అంటూ అనవసర విషయాల జోలికి వెళ్లకుండా కథ, కథనం మీద మాత్రమే ఆధారపడి సినిమాలు తీసే ఆర్టిస్టిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
అతని సినిమాలు అన్ని చాలా కళాత్మకంగా ఉంటాయనే పేరు ఉంది.అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా ఏలేటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారు కానీ ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఇష్టపడరు.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గతంలో గోపీచంద్ సాహసం సినిమా చేశాడు.అతని కెరియర్ లోనే అది పెద్ద హిట్ మూవీ.
ఆ సినిమా తర్వాత ఏలేటి మళ్ళీ గ్యాప్ తీసుకొని స్క్రీన్ ప్లే బేస్ తో అదిరిపోయే కథ సిద్ధం చేసుకొని హీరో నితిన్ ని ఒప్పించి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఇక కరోనా లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.అయితే లాక్ డౌన్ తర్వాత అయినా ఈ సినిమాని నితిన్ సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనికుంటే ప్రస్తుతానికి ఏలేటి సినిమాపై నితిన్ కనీసం ఆలోచించేట్లు కూడా కనిపించడం లేదు.
ప్రస్తుతం రంగ్ దే సినిమాని పూర్తి చేయడంతో పాటు నెక్స్ట్ అందాదున్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.అదే సమయంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే పవర్ పేట మీద కూడా ఫోకస్ పెట్టాడు.
చంద్రశేఖర్ ఏలేటి సినిమా గురించి మాట్లాడిన సందర్భంగా కూడా లేదు.ఈ నేపధ్యంలో వీరిద్దరి ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే మాట వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
.