యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ట్రో కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీనికి కారణం ఆ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘అంధాధున్’కు రీమేక్గా వస్తుండటమే.
ఇక ఈ సినిమాలో హీరో గుడ్డివాడి పాత్రలో నటించనుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే చాలా రోజులు అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ ఏడు రోజుల షూటింగ్తో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తుందని, ఇక త్వరలోనే సినిమా రిలీజ్ విషయాన్ని కూడా అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.ముందుగా ఈ సినిమాను జూన్ 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినా, కరోనా కారణంగా ఇప్పుడు రిలీజ్ను వాయిదా వేసింది.
ఇక ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్ బెస్ట్గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాను దర్శకుడు మేర్లపాక గాంధీ అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, నితిన్ సరసన హీరోయిన్గా నభా నటేష్ నటిస్తోంది.ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.