యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్లో పెడుతూ స్పీడుగా దూసుకుపోతున్నాడు.ఈయేడు భీష్మ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు ‘రంగ్ దే’ అనే సినిమాను రిలీజ్కు రెడీ చేస్తు్న్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తవ్వడంతో, తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెడుతున్నాడు.ఈ క్రమంలోనే బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.
అయితే అంధాధున్లో బోల్డ్ పాత్రలో టబు చేసిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాకే హైలైట్గా నిలిచింది.ఆ పాత్ర సినిమాకు చాలా ప్రధానం కావడంతో, తెలుగులో ఆ పాత్రను ఎవరితో చేయించాలా అనే ఆలోచనలో నితిన్ పడ్డాడు.
ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు పేర్లు పరిశీలించినా వారితో ఎందుకో వర్కవుట్ కాదని నితిన్ ఫీల్ అవుతున్నాడు.కాగా తాజాగా ఈ పాత్రలో నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల వెంట పడుతున్నాడట నితిన్.
టాలీవుడ్లో దశాబ్ద కాలంగా రాణిస్తున్న అందాల భామ శ్రియా, ప్రియమణిలలో ఒకరిని ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించే పనిలో నితిన్ అండ్ టీమ్ పడింది.ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరైనా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తారని నితిన్ భావిస్తున్నాడు.
అందుకే వారిని ఎలాగైనా ఈ సినిమాలో నటింపజేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.కాగా నితిన్ సరసన హీరోయిన్గా ప్రియాంకా ఆరుల్ మోహన్ నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తుండగా నితిన్ హోం బ్యానర్పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.