యూత్ స్టార్ నితిన్ లాక్ డౌన్ తర్వాత ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.గత ఏడాది భీష్మతో సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకున్న నితిన్ ఈ ఏడాది మాత్రం రెండు బిగ్ డిజాస్టర్ లని ఖాతాలో వేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
చెక్ సినిమాకి ఏకంగా 15 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక రంగ్ దే టాక్ చూస్తూ ఉంటే ఇప్పటికే నెగిటివ్ వచ్చేసింది.
ఎంచుకున్న కంటెంట్ బాగున్న దానిని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు వైఫల్యం కారణంగా రంగ్ దే ఒక బిలో ఎవరేజ్ మూవీగా నిలిచిపోయిందని ప్రేక్షకుల నుంచి వస్తున్నా కామెంట్స్.అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఏ మాత్రం ఆసక్తి లేకుండా ఈ సినిమాకి మ్యూజిక్ అందించినట్లు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కరోనా ఎఫెక్ట్, దానికితోడు సినిమాకి డివైడ్ టాక్ రావడంతో థియేటర్స్ ఖాళీ అయిపోయాయని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే నితిన్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెట్టాడు.హిందీలో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ లో తెరకెక్కిన అందాధున్ రీమేక్ ని ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.ఈ సినిమాలో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ఉండగా, హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.తాజాగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.
సినిమాకి మ్యాస్ట్రో టైటిల్ ని ఫిక్స్ చేశారు.సినిమాలో హీరో పాత్ర అంధుడుగా ఉంటుంది.
దాంతో పాటు పియానో ప్లేయర్ గా కూడా కనిపిస్తాడు.ఈ నేపధ్యంలో మ్యాస్ట్రో టైటిల్ యాపట్ అవుతుందని దీనిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
నితిన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు.అలాగే సినిమాని జూన్ 11న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ కూడా ఎనౌన్స్ చేయడం విశేషం.