టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 2న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా ప్రకటించారు.
కానీ వారికి కరోనా వైరస్ కోలుకోలేని ఝలక్ ఇచ్చింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది.
ఇక ఈ సినిమాను కనీసం ఓటీటీలోనైనా రిలీజ్ చేయాలని అభిమానులు కోరారు.
కానీ తొలుత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపని చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాను ఎలాగైనా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాత కోన వెంకట్ ఈ విషయంపై అభిమానుల అభిప్రాయం కూడా తీసుకున్నాడు.అటు స్వీటీ అనుష్క కూడా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పేసుకుంది.
అయితే ఇంకా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారిపోయింది.
కేవలం ప్రేక్షకుల అభిప్రాయం తీసుకునేందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అంశాన్ని లేవనెత్తారా అని పలువురు చిత్ర యూనిట్పై మండి పడుతున్నారు.ఇతర హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటుంటే అనుష్క మాత్రం ఎందుకు ‘నిశ్శబ్దం’గా ఉందని ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పూర్తి థ్రిలర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్కతో పాటు అంజలి, మాధవన్, షాలిని పాండే నటిస్తుండగా హేమంత్ మధుకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.