టాలీవుడ్లో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నిశ్శబ్ధం’ చిత్రం రిలీజ్ మాత్రం కాలేదు.స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వస్తుండటంతో, ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం తక్కువగా ఉందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తూ వస్తోంది.
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ‘నిశ్శబ్ధం’ చిత్రంలో అనుష్క మూగమ్మాయిగా నటిస్తుంది.
అంజలి, మాధవన్, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.ఎట్టకేలకు అనుష్క నిశ్శబ్ధం వీడటంతో ఆమె ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు.
మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.